విజయవాడ మహిళకు మిసెస్ ప్లానెట్ కిరీటం

విజయవాడ మహిళకు మిసెస్ ప్లానెట్ కిరీటం

అందాల పోటీల్లో బెజవాడ బ్యూటీ నాగ మల్లిక తళుక్కున మెరిశారు. మిసెస్ ప్లానెట్ – 2022 కిరీటాన్ని కైవసం చేసుకున్నారు. బల్గేరియాలో జరిగిన పోటీల్లో ప్రథమ స్థానంలో నిలిచారు. జూలై 6 నుంచి 15 వరకు మిసెస్ ప్లానెట్ పోటీలను నిర్వహించారు. 60 దేశాలకు చెందిన వివాహిత మహిళలు ఈ కాంపిటీషన్ లో పాల్గొన్నారు. వారందరినీ వెనక్కి నెట్టి నాగ మల్లిక తొలి స్థానాన్ని ఆక్రమించారు.

ఏపీలోని విజయవాడకు చెందిన మల్లిక ఎంబీఏ చదివారు. ఓ పారిశ్రామికవేత్తను పెళ్లి చేసుకున్నారు. వారికి ఒక కుమారుడు ఉన్నాడు. వివాహం అయిన తర్వాత మల్లిక అందాల పోటీల్లో సత్తా చాటుతూ వస్తున్నారు. ఇప్పటికే శ్రీమతి అమరావతి, మిసెస్ ఏపీ వంటి టైటిళ్లను గెల్చుకున్నారు. రాజస్థాన్‌ లో జరిగిన మిసెస్‌ ఇండియా- 2021 అందాల పోటీల్లోనూ ప్రథమ స్థానంలో నిలిచారు.

మిసెస్ ప్లానెట్ టైటిల్ గెల్చుకున్న తర్వాత మల్లిక గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ ఆమెకు ఘన స్వాగతం లభించింది. కుటుంబ సభ్యులు, అభిమానులు మల్లికకు గ్రాండ్ వెల్ కం చెప్పారు. అటు, మిసెస్ ప్లానెట్ కిరీటం దక్కించుకోవాలన్నది తన కల అని … దాన్ని సాధించానని మల్లిక అన్నారు. ఈ విజయం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.

Poultary

మల్లికకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. ఫోటో షూట్ లతో ఆమె ఎంతో పాపులర్ అయ్యారు. ఫ్యాన్స్ అభిమానాన్ని సొంతం చేసుకున్నారు.

 

ALSO READ: 5వ రౌండ్ లోనూ రిషి సునాక్ విజయం

Bharati Cement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here