Food Awards 2023

హైదరాబాద్, August 2023 :  హైబిజ్ టీవీ ఫుడ్ అవార్డ్స్ 2వ ఎడిషన్కు సంబంధించిన పోస్టర్ & ట్రోఫీ ఆవిష్కరణ హోటల్ గోల్కొండ, మాసబ్ ట్యాంక్లో నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో సురేష్ చిట్టూరి – VC & MD – శ్రీనివాస ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్,  చేతన్ -DGM మార్కెటింగ్- జెమిని ఎడిబుల్స్ & ఫ్యాట్స్ ఇండియా, నటి కిషోరి ధాత్రక్ (కొర్రమీను, తెప్పసముద్రం)తో పాటు హైబిజ్ టీవీ & తెలుగు నౌ మేనేజింగ్ డైరెక్టర్, ఎం. రాజ్గోపాల్  పాల్గొన్నారు.

హైదరాబాద్ను ఫుడ్ గ్రాఫ్లో అత్యున్నత స్థితికి తీసుకురావడంలో కీలకపాత్ర పోషించిన వ్యక్తులను  హైబిజ్ టీవీ సత్కరించనుంది. వ్యక్తులు, హోటళ్లు, రెస్టారెంట్లు, జ్యూస్ అవుట్లెట్లు, బేకరీలు, మండి మొదలగు రంగాల్లో  సేవలను అందించే బ్రాండ్లకు మరోసారి అరుదైన గుర్తింపు లభించనుంది.

Poultary

మీడియా, ఉమెన్ లీడర్షిప్, హెల్త్కేర్, టీ మేకింగ్ మరియు ఐస్క్రీమ్ టేస్టింగ్ పోటీల్లో  గెలుపొందిన వారికి అవార్డులు ఇవ్వడంలో సంవత్సరాల తరబడి విజయం సాధించిన తర్వాత,రెండవ సారి హైబిజ్ టీవీ ఆహార పరిశ్రమ రంగంలో విజయం సాధించిన వారికి అవార్డులు ప్రదానం చేయాలని నిర్ణయించుకుంది.

 

గత సంవత్సరంలో నిర్వహించిన ఫుడ్ అవార్డ్స్  అద్భుతమైన విజయం సాధించిన తర్వాత, ఫుడ్ అవార్డ్స్ 2వ ఎడిషన్ లోను 50 కి పైగా కేటగిరీల్లో అవార్డులను అందజేయనుంది.

22 ఆగస్ట్ 2023 నామినేషన్లకు చివరి తేదీ, కావున ఆహార పరిశ్రమలో పని చేసే వారు తప్పనిసరిగా ముందుకు వచ్చి, తమను తాము నామినేట్ చేసుకోని , సైన్ అప్  చేసుకోవలసిందిగా కోరుతున్నాం. అవార్డు గ్రహీతలను అనేక విభాగాలలోని ప్రముఖ జ్యూరీ సభ్యులచే నిర్ణయించబడతారు.

Bharati Cement