‘జావా వే’ని ప్రతిబింబిస్తూ, జావా యెజ్డీ మోటర్‌సైకిల్స్ సగర్వంగా పునర్నిర్మించిన జావా 350ని విడుదల చేసింది.  కాలాతీత  అందం మరియు పటిష్టమైన ఇంజినీరింగ్‌కు నివాళిగా   రూ. 2,14,950 (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) ధర లో అందిస్తున్నారు.  కొత్త జావా 350 భారతదేశంలో నేడు అందుబాటులో ఉన్న అత్యంత వేగవంతమైన, ఉత్తమ నిర్వహణ, ఉత్తమ బ్రేకింగ్, సురక్షితమైన క్లాసిక్ మోటర్‌సైకిల్ గా నిలుస్తుంది.

జావా 350, ఇప్పుడు మెరూన్, నలుపు మరియు సరికొత్త మిస్టిక్ ఆరెంజ్ రంగులలో అందుబాటులో ఉంది, దాని మెరుగుపెట్టిన క్రోమ్ మరియు గోల్డెన్ పిన్‌స్ట్రైప్‌లతో అందాన్ని పునర్నిర్వచిస్తుంది.

“కొత్త జావా 350 మోటర్‌సైకిల్ కంటే ఎక్కువ; ఇది వారసత్వపు పునర్జన్మ” అని జావా యెజ్డీ మోటర్‌సైకిల్స్ యొక్క సీఈఓ శ్రీ ఆశిష్ సింగ్ జోషి చెప్పారు. “మేము భవిష్యత్తును ఆలింగనం చేసుకుంటూనే , దాని గతాన్ని గౌరవించే యంత్రాన్ని రూపొందించాము. ఇది జావా మార్గం యొక్క పరిపూర్ణ ప్రాతినిధ్యం – క్లాసిక్ అప్పీల్ మరియు ఆధునిక కార్యాచరణల యొక్క సౌకర్యవంతమైన మిశ్రమం ఇది. కొత్త జావా 350 దానితో రైడర్‌లను గొప్ప నాణ్యత,  లుక్స్ మరియు ఫ్లూయిడ్, క్లిష్టతరమైన రైడింగ్ అనుభవం తో ఆనంద పరుస్తుందని మేము విశ్వసిస్తున్నాము ” అని అన్నారు

Poultary
Bharati Cement