నగరంలోని ప్రముఖ కళా, సాంస్కృతిక కేంద్రమైన రవీంద్ర భారతిలో శనివారం జరిగిన హెత్విత నల్లారి కూచిపూడి రంగప్రవేశ కార్యక్రమం అందరిని ఆకట్టుకుంది.

శ్రీ నల్లారి నిరూప్ కుమార్ రెడ్డి, శ్రీమతి రూపన దంపతుల కుమార్తె హెత్విత నల్లారి తన కూచిపూడి రంగ ప్రవేశలో భాగంగా ప్రదర్శించిన ప్రత్యేక నృత్య ప్రదర్శన అందరిని అలరించింది. ప్రపంచ స్థాయిలో ఎన్నో అవార్డులను సాధించిన ప్రముఖ కూచిపూడి నృత్యకారిణి, మాజీ తెలంగాణ సంగీత, నాటక చైర్ పర్సన్ దీపికారెడ్డి మార్గదర్శకత్వంలో హెత్విత నల్లారి కూచిపూడి నేర్చుకుంది.

హెత్విత నల్లారి ప్రదర్శించిన శ్రీ విఘ్నరాజం భజే , భామ ప్రవేశ దరువు , శివ శివ భవ భవ చరణం, అలరులు కురియగ, తిల్లాన వంటి నృత్య ప్రదర్శనలు కళాప్రియులను సందడి చేసాయి.

Poultary

రవీంద్రభారతిలో జరిగిన కూచిపూడి రంగ ప్రవేశ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్ష్యుడు కిషన్ రెడ్డి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, జాతీయ నాటక అకాడమి, చైర్మన్, డాక్టర్ సంధ్య పురిచ, పద్మశ్రీ అవార్డు పొందిన మొదటి ఇంటీరియర్ డిజైనర్ సునీత కోహ్లీ, హైదరబాద్ పోలిస్ కమీషనర్ కె. శ్రీనివాస రెడ్డి, ఎలికో లిమిటెడ్ వైస్ చైర్ పర్సన్, మేనేజింగ్ డైరెక్టర్ వనితా దాట్ల హాజరయ్యారు.

Bharati Cement