తెలుగు యువతకు మరో గర్వకారణం! ఎం. సాయి దీప్ నార్త్ అమెరికాలో జరుగుతున్న CRA (చాంపియన్ రేసింగ్ అసోసియేషన్) 2025 రేసింగ్ సీజన్లో తన ప్రతిభతో సంచలనం రేపుతున్నారు. ఆయన 400 GT మరియు 400 సూపర్బైక్ విభాగాల్లో అగ్ర స్థానంలో నిలుస్తూ, డబుల్ ఛాంపియన్ టైటిల్కు సమీపిస్తున్నారు.
రేసింగ్ ప్రపంచంలో తెలుగు ప్రతిభకి గర్వకారణం
MSD రేసింగ్ – నార్త్ కాలిఫోర్నియా జట్టు తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న సాయి దీప్, ఇప్పటికే ముగిసిన మూడు రౌండ్లలో అపారమైన రేసింగ్ నైపుణ్యాన్ని ప్రదర్శించారు.
“ఈ CRA సీజన్ ఒక కలలా అనిపించింది. మా టీమ్ చేసిన కష్టానికి ఇదే ఫలితం,” అని M సాయి దీప్ తెలిపారు.
చివరి దశకే చేరిన CRA 2025: చరిత్ర రాస్తారా M సాయి దీప్ వి?
ఈ నెల జూన్ 27-29 తేదీల్లో బటన్విల్లో రేస్వేలో జరగనున్న చివరి రౌండ్ కు ముందు నుంచే, సాయి దీప్ రెండు విభాగాల్లోనూ పాయింట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఇది మోటార్స్పోర్ట్స్ ప్రియుల్లో ఆసక్తిని రేపుతోంది.
భారత రేసింగ్ చరిత్రలో కీలక మైలురాయి
మహీ రేసింగ్ టీమ్ ఇండియాకి స్థాపకులలో ఒకరిగా, సాయి దీప్ 2013లో వరల్డ్ ఛాంపియన్షిప్ గెలిచే జట్టుకు నాయకత్వం వహించారు. ఇది అంతర్జాతీయ మోటార్ స్పోర్ట్స్ రంగంలో భారతదేశానికి గర్వకారణంగా నిలిచింది.
అంతర్జాతీయ అనుభవం – దేశవాళీ నైపుణ్యం
2010లో మోటోజీపీ సపోర్ట్ రేసులో అర్హత సాధించిన మొదటి భారతీయుడు సాయిదీపే. అప్పటి నుంచి ఆయన ప్రపంచవ్యాప్తంగా వివిధ రేసింగ్ ఈవెంట్లలో పాల్గొన్నారు:
- మలేషియా జీపీ
- ఏషియన్ జీపీ
- AMA రేసింగ్
- వరల్డ్ సూపర్ బైక్
- నాస్కార్
- ఫార్ములా 1
- ఇండీకార్ సిరీస్
అమెరికా రేస్ ట్రాక్లపై ట్రైనింగ్ & అనుభవం
ఇంగ్లండ్, కాలిఫోర్నియాల్లో శిక్షణ పొందిన సాయి దీప్, లగునా సెకా, ఇన్ఫినియన్ రేస్వే, విల్లో స్ప్రింగ్స్ లాంటి ప్రపంచ ప్రఖ్యాత రేస్ ట్రాక్లపై అనుభవాన్ని సంపాదించారు. పలు ట్రాక్ డేస్ ఈవెంట్లను కూడా నిర్వహించారు.
చిన్నదనం నుండి ఛాంపియన్ వరకూ
తిరుపతిలో జన్మించి, హైదరాబాద్ & చెన్నైలో విద్యనభ్యసించిన సాయి దీప్, భారత వీధుల్లో బైక్తో ప్రయాణం ప్రారంభించి, ఇప్పుడు అంతర్జాతీయ వేదికలపై విజయాన్ని అందుకుంటున్నారు.
రేసర్ మాత్రమే కాదు, విప్లవాత్మక ఆలోచనల యజమానుడు
సాయి దీప్ ఒక నైపుణ్యం గల రేసర్ మాత్రమే కాదు, విజన్ ఉన్న టీమ్ ఓనర్, అలాగే ఎలక్ట్రిక్ వాహనాలపై అవగాహన పెంచే ప్రచారకుడిగా కూడా గుర్తింపు పొందారు.