ఏపీ లిక్కర్ స్కామ్_
లిక్కర్ కేసులో తప్పుడు స్టేట్‌మెంట్

ఆంధ్రప్రదేశ్‌లో లిక్కర్ స్కాం కేసు విచారణ మరింత వేడెక్కుతోంది. తాజాగా, ఈ కేసుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖలో పనిచేస్తున్న ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ మదన్ రెడ్డి, సిట్ అధికారులపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఆయన తన ఆరోపణలపై ఒక లేఖను రాసి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, డీజీపీ హరిష్ కుమార్ గుప్తాలకు పంపినట్లు సమాచారం.

ఈ లేఖలో మదన్ రెడ్డి చేసిన ఆరోపణలు నిజంగా సంచలనాత్మకంగా మారాయి. ఆయన వెల్లడించిన వివరాల ప్రకారం, గత పదేళ్లుగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికు గన్‌మెన్‌గా సేవలు అందించిన ఆయనను, లిక్కర్ కేసులో తప్పుడు స్టేట్‌మెంట్ ఇవ్వమని సిట్ అధికారులు ఒత్తిడి చేస్తున్నారట. అంతేకాదు, “ఇంతకముందు విచారణకు హాజరైన గిరి కూడా తాము చెప్పినట్లే చెప్పాడని” అధికారులు తనను భయపెట్టారని పేర్కొన్నారు.

మరింత ఆందోళన కలిగించే అంశం ఏమిటంటే – యూనిఫామ్‌లో హాజరు కాలేదని తిట్టడం, తప్పుడు వాంగ్మూలాన్ని తీసుకోలేదని దాడికి పాల్పడడం వంటి విషయాలను కూడా ఆయన లేఖలో పొందుపరిచారు. మదన్ రెడ్డి తన లేఖలో, “ఇకపై తాను ఒంటరిగా సిట్ విచారణకు హాజరుకాలేను” అని స్పష్టం చేశారు.

Poultary

ఈ లేఖ ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లోనూ, పోలీస్ వ్యవస్థలోనూ చర్చనీయాంశంగా మారింది. లిక్కర్ స్కామ్‌లో చెవిరెడ్డి పాత్రపై గత కొన్ని రోజులుగా ఆందోళన కొనసాగుతుండగా, ఇప్పుడు మదన్ రెడ్డి లేఖ కొత్త వానిని తెరిచింది. అధికార సెట్ విచారణ నడిపే తీరుపై నమ్మక స్ధాయిని కుదించేలా ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ లేఖ ఆధారంగా సిట్‌పై ప్రభుత్వం ఏమేరకు స్పందిస్తుంది? మదన్ రెడ్డి ఆరోపణలకు న్యాయ పరంగా విచారణ జరగుతుందా? అనే ప్రశ్నలు జనాల్లో కలకలం రేపుతున్నాయి.

Bharati Cement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here