మిస్ యూనివర్స్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఫైనలిస్ట్లు హైబిజ్ టీవీ కార్యాలయ సందర్శన.
హైదరాబాద్, జూన్ 6, 2025: మిస్ యూనివర్స్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2025 పోటీల ఫైనలిస్ట్లు 30 మంది ఈ రోజు హైదరాబాద్లోని హై బిజ్ టీవీ కార్యాలయాన్ని సందర్శించారు. హై బిజ్ టీవీ ఆతిథ్యం ఇచ్చిన ఈ కార్యక్రమంలో కంటెస్టెంట్లు మాట్లాడుతూ.. తమ రాష్ట్రాల సంస్కృతి, సంప్రదాయాలు, సామాజిక సమస్యలపై చర్చించారు. మిస్ యూనివర్స్ ఏపీ, తెలంగాణ కార్యక్రమంలో మీడియా పార్టనర్గా ఉన్న హైబిజ్ టీవీ కార్యాలయాన్ని సందర్శించడం ఆనందంగా ఉందని కంటెస్టెంట్లు అన్నారు. తెలుగు వారిని ప్రోత్సహించడంలో హైబిజ్ టీవీ చూపిస్తున్న ఆసక్తికి ముగ్థులయ్యామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మిస్ యూనివర్స్ కంటెస్టెంట్లతో పాటు… ఏపీ డైరెక్టర్ డాక్టర్ సునీతా, మిస్ యూనివర్స్ తెలంగాణ డైరెక్టర్ ప్రసాద్ గారపాటి, ఏపీ కో-ఆర్డినేటర్ నిరుపమా, తెలంగాణ కో-ఆర్డినేటర్ రితీష్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా, హై బిజ్ టీవీ మేనేజింగ్ డైరెక్టర్ ఎమ్.రాజగోపాల్, హై బిజ్ ఎల్ఎల్పి ఎమ్.డీ టి.సంధ్యారాణీ, భారతీ సిమెంట్ నుండి మల్లారెడ్డి.. ఫైనలిస్ట్లను సన్మానించి, మిస్ యూనివర్స్ కంటెస్టెంట్లు వారి ప్రయాణంలో విజయం సాధించాలని కోరారు. ఇక, జూన్ 7వ తేదీ, హైదరాబాద్లోని ఆజీజ్నగర్, ధారా రిసార్ట్, కన్వెన్షన్లో జరగనున్న గ్రాండ్ ఫినాలేలో ఈ ఫైనలిస్ట్లు పోటీపడనున్నారు.