తిరుమల శ్రీవారి లడ్డూ
తిరుమల శ్రీవారి లడ్డూ

శ్రీవారి దర్శనం ఎంత పవిత్రమైతే, శ్రీవారి లడ్డూ ప్రసాదం కూడా అంతే ప్రత్యేకమైనది. ఇప్పుడు ఈ లడ్డూ కొనుగోలు మరింత సులభం కానుంది. టీటీడీ ప్రవేశపెట్టిన కియోస్క్ లడ్డూ విక్రయ సదుపాయం భక్తులకు వేచి ఉండే సమయాన్ని తగ్గిస్తూ, డిజిటల్ చెల్లింపులతో ప్రక్రియను వేగవంతం చేస్తోంది.

కియోస్క్ ద్వారా లడ్డూ ఎలా పొందాలి?

లడ్డూ కియోస్క్ యంత్రాలు తిరుమలలోని లడ్డూ కౌంటర్ల సమీపంలో ఏర్పాటు చేయబడ్డాయి. భక్తులు అక్కడికి వెళ్లి, యంత్రంలో కనిపించే రెండు ఆప్షన్లలో ఒకదాన్ని ఎంచుకోవచ్చు:

  1. దర్శన టికెట్ ఉన్నవారు
    • టికెట్ వివరాలు యంత్రం ద్వారా కన్ఫర్మ్ అవుతాయి
    • ఒక్కో వ్యక్తికి ఇంకా 2 లడ్డూల వరకు కొనుగోలు అవకాశం
  2. దర్శన టికెట్ లేనివారు
    • ఆధార్ నంబర్ వరిఫై చేయాల్సి ఉంటుంది
    • ఒక్కో వ్యక్తికి 2 లడ్డూల వరకు కొనుగోలు అవకాశం

ఆ తర్వాత, యూపీఐ ద్వారా చెల్లింపు చేసి రసీదు పొందొచ్చు. ఆ రసీదు చూపించి లడ్డూ కౌంటర్ వద్ద లడ్డూలు తీసుకోవచ్చు.

Poultary

డిజిటల్ టచ్ తో పారదర్శకత

ఈ కొత్త విధానంలో:

  • నగదు లావాదేవీల అవసరం లేదు
  • యూపీఐ పేమెంట్ సదుపాయం అందుబాటులో ఉంది
  • లడ్డూ పొందే ప్రక్రియ వేగంగా, పారదర్శకంగా సాగుతుంది

భక్తులు ఎప్పటికప్పుడు దౌత్యం లేకుండా లడ్డూలను పొందగలుగుతున్నారు. ఈ డిజిటల్ సదుపాయానికి మంచి స్పందన వస్తోంది.

Bharati Cement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here