Bandaru Dattatreya Book Launch బండారు దత్తాత్రేయ ఆత్మకథ
Bandaru Dattatreya Book Launch

హర్యానా గవర్నర్, సీనియర్ రాజకీయ నేత బండారు దత్తాత్రేయ రచించిన ఆత్మకథ ‘ప్రజల కథే నా ఆత్మకథ’ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. 2025 జూన్ 8న హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో ఉదయం 11 గంటలకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ పుస్తకం, తెలుగు ప్రతిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు. ఈ ఆత్మకథ దత్తాత్రేయ వ్యక్తిగత, రాజకీయ ప్రస్థానాన్ని, ప్రజా సేవ పట్ల ఆయన అంకితభావాన్ని వివరిస్తుంది. కాగా, ఈ పుస్తకం, తెలుగు సాహిత్యంలో, రాజకీయ జీవితంలో ఒక ముఖ్యమైన ఘట్టంగా పరిగణించబడినట్లు పలువురు భావిస్తున్నారు.

ఈ కార్యక్రమంలో… మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డితో పాటు
తెలంగాణ మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, శ్రీధర్ బాబు, బీజేపీ ఎంపీ రఘునందన్ రావు, ఇతర రాజకీయ నాయకులు, ఉన్నతాధికారులు, సాహిత్య ప్రముఖులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా… ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ… బండారు దత్తాత్రేయ నిబద్ధత, నిరాడంబరత, ప్రజా సంక్షేమం పట్ల అంకితభావాన్ని కొనియాడారు. ఆయన జీవితం యువతకు స్ఫూర్తిదాయకమని, సామాన్యుడిగా మొదలై ఉన్నత శిఖరాలకు చేరిన ప్రస్థానం ఈ పుస్తకంలో ప్రతిబింబిస్తుందని అన్నారు. ఇక, మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు మాట్లాడుతూ… దత్తాత్రేయ జీవితం సమాజానికి ప్రతిబింబంగా ఉందని, నిత్యం ప్రజలతో మమేకమైన నాయకుడిగా ఆయన జీవితం ఒక ఉదాహరణ అని పేర్కొన్నారు. ఈ పుస్తకం నేటి తరానికి స్ఫూర్తినిస్తుందని అభిప్రాయపడ్డారు.

Poultary

ఇక, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి… దత్తాత్రేయను తన రాజకీయ గురువుగా పేర్కొన్నారు. ఆయనతో కలిసి అనేక ప్రజా ఉద్యమాల్లో పనిచేసిన అనుభవాలను గుర్తు చేసుకున్నారు. ఈ పుస్తకం ఆయన సేవా ప్రస్థానాన్ని సమర్థవంతంగా వివరిస్తుందని అన్నారు. అలాగే, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి… దత్తాత్రేయ జీవితాన్ని ప్రజలకు అంకితం చేసిన విధానం, రాజకీయ ప్రయాణం, పేదల పట్ల మమకారాన్ని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడం గర్వకారణమని తెలిపారు. ఇక, బండారు దత్తాత్రేయ స్పందిస్తూ… తన జీవిత కథ యువతను నిబద్ధత, వినయంతో ప్రజాసేవ వైపు నడిపించాలని ఆశించినట్లు తెలిపారు. పుస్తకం తన రాజకీయ, వ్యక్తిగత ప్రస్థానంతో పాటు ప్రజల కష్టసుఖాలను ప్రతిబింబిస్తుందని అన్నారు.

అయితే, ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు చంద్రబాబుకు ఘన స్వాగతం పలకగా… కాంగ్రెస్ మంత్రులు కూడా ఆయనతో ఉత్సాహంగా సంభాషించారు. ముఖ్యంగా, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డిలు పలకరించుకొని, మాట్లాడుకోవడం అందర్నీ ఆకర్షించింది. నిజానికి, ఈ వేదిక రాజకీయ సౌహార్దానికి సంకేతంగా నిలిచింది.

Bharati Cement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here