Ahmedabad Plane Crash Live Updates
Ahmedabad Plane Crash Live Updates

అహ్మదాబాద్ విమానాశ్రయంలో ఘోర ప్రమాదం జరిగింది. ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ సమయంలో ఒక్కసారిగా కుప్పుకూలింది. ఈ ప్రమాదంలో 242 మంది మృతి చెందినట్లు ప్రాథమిక సమాచారం ఉండగా.. ఇప్పటివరకు కనీసం 52 మంది మృత దేహాలను వెలికి తీసినట్లు తెలుస్తోంది. విమానం ఇంజిన్‌లో సాంకేతిక లోపం కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఈ విమానం అహ్మదాబాద్ నుంచి లండన్‌కు వెళుతోంది. గాయపడిన వారిని సివిల్ ఆసుపత్రికి తరలిస్తున్నారు.

ఇప్పటివరకు అందిన ప్రాథమిక సమాచారం ప్రకారం, విమానం టేకాఫ్ అయిన తర్వాత మేఘని-నగర్ సమీపంలో ఎయిర్ ఇండియా విమానం కూలిపోయింది. విమానంలో 171 మంది ప్రయాణికులు ఉన్నారని… అందులో, 61 మంది విదేశీయులు ఉన్నట్లు సమాచారం. ఈ ఘోర ప్రమాదంలో వస్త్రపూర్ వరకు పొగలు వ్యాపించాయి. ఈ విమానం నివాస ప్రాంతంలో కూలిపోయిందని సమాచారం. ప్రమాదం తర్వాత అనేక రోడ్లు మూసుకుపోయాయి. గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ ఈ విమానంలో ఉన్నట్లు తెలుస్తోంది.

అయితే, ఎయిర్ ఇండియా విమానం AI171 సిబ్బంది టేకాఫ్ అయిన వెంటనే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కి MAYDAY కాల్ చేసారు. కానీ, ఆ తర్వాత ATC విమానానికి చేసిన కాల్స్‌కు ఎటువంటి స్పందన ఇవ్వలేదని…. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఒక ప్రకటనలో తెలిపింది. అయితే, విమానాన్ని నడిపించిన కెప్టెన్ సుమీత్ సబర్వాల్‌కు సుమారు 8 వేల 200 గంటల ఫ్లయింగ్ అనుభవం ఉంది. ఆయనతో పాటు ఉన్న ఫస్ట్ ఆఫీసర్ క్లైవ్-కుందార్‌కు 11 వందల గంటల పైలట్ అనుభవం ఉంది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఎయిర్ ఇండియా విమానం కూలిపోవడంతో అహ్మదాబాద్ విమానాశ్రయ కార్యకలాపాలు నిలిపివేశారు.

Poultary

అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటన గురించి హోంమంత్రి అమిత్ షా… గుజరాత్ సీఎం… పోలీసు కమిషనర్‌తో మాట్లాడారు. ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు విజయవాడ నుండి అహ్మదాబాద్‌కు వచ్చారు. ప్రధాని మోదీ మంత్రితో ఫోన్‌లో మాట్లాడి, ప్రమాదంపై ఆరాతీసినట్లు తెలుస్తోంది. ఇక తదుపరి విచారణ తర్వాత ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

Bharati Cement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here