ఇజ్రాయెల్-ఇరాన్
ఇజ్రాయెల్-ఇరాన్

ప్రపంచం మరోసారి యుద్ధ భయం మధ్యలో నిలబడి ఉంది. ఇజ్రాయెల్ చేసిన భారీ దాడులు, తర్వాత ఇరాన్ ఇచ్చిన తీవ్రమైన ప్రతీకారం కారణంగా మిడిల్ ఈస్ట్ ప్రాంతం నిప్పుల కొలనుగా మారుతోంది. యుద్ధ మేఘాలు కమ్ముకుంటుండటంతో, సోషల్ మీడియా దుమ్మెత్తిపోతోంది – “ఇది వరల్డ్ వార్ 3 ప్రారంభమా?” అనే భయాలూ పెరిగిపోతున్నాయి.

దాడులతో ప్రారంభమైన ఉద్రిక్తత

ఇజ్రాయెల్ “ఆపరేషన్ రైజింగ్ లయన్” పేరిట జూన్ 13 తెల్లవారుజామున ఇరాన్‌లోని కీలక అణు కేంద్రాలు, సైనిక స్థావరాలపై ప్రీ-ఎంప్టివ్ స్ట్రైక్స్ నిర్వహించింది. ఈ దాడుల్లో ఇరాన్‌కి చెందిన ఉన్నత సైనిక అధికారులు, అణు శాస్త్రవేత్తలు చనిపోయినట్లు స్థానిక మీడియా నివేదించింది.

ఇరాన్ ప్రతీకారం: డ్రోన్ల దాడులతో సమాధానం

ఇజ్రాయెల్ దాడులకు ప్రతిగా, ఇరాన్ 100కిపైగా డ్రోన్లతో భారీ ప్రతీకార దాడులకు దిగింది. టెల్ అవీవ్ పై దాడులకు ప్రయత్నించగా, ఐరన్ డోమ్ కాస్త తక్కువ పనితీరును చూపించిందనే విమర్శలు వచ్చాయి.

Poultary

ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా ఖమేనీ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఇది కేవలం ప్రారంభం మాత్రమేనని స్పష్టం చేశారు.

అంతర్జాతీయ స్పందన – ప్రపంచం ఆందోళనలో

సౌదీ అరేబియా, ఖతర్, పాకిస్తాన్ లాంటి దేశాలు ఇజ్రాయెల్ చర్యలను ఖండించాయి. భారత ప్రభుత్వం రెండు దేశాలనూ సంయమనం పాటించాలని కోరింది. అమెరికా, తాము ఈ దాడిలో ప్రమేయం లేదని చెప్పినా, ఈ పరిణామాలు షాడో వార్‌ను ఓ ప్రత్యక్ష యుద్ధంగా మార్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఈ సంక్లిష్ట పరిస్థితుల నేపథ్యంలో మిడిల్ ఈస్ట్ ఆర్థికంగా, రాజకీయంగా హత్తుకున్న ఉక్కిరిబిక్కిరి వాతావరణం ఏర్పడుతోంది. ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు ఇంకెక్కడి వరకూ చేరతాయో? ఈ పరిణామాలు నిజంగా వరల్డ్ వార్ 3కు కారణమవుతాయా?

కాలమే సమాధానం చెబుతుంది…

Bharati Cement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here